క్యాడ్బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నిర్దారించింది. ఇటీవల అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి క్యాడ్బరీ చాక్లెట్ కొన్నాడు. చాక్లెట్ తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు చాక్లెట్ను టెస్ట్ చేసి తెల్లటి పురుగులు ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు ఈ చాక్లెట్లకు దూరంగా ఉండాలని సూచించారు.