హైదరాబాద్ లోని బషీర్బాగ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మన్షీ, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాహుల్గాంధీ న్యాయ్ యాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు.