కారులో మంటలు.. చూస్తుండగానే దగ్ధం (వీడియో)

572చూసినవారు
కారులో మంటలు చెలరేగి చూస్తుండగానే దగ్ధం అయింది. ఈ ఘటన లక్డీకపూల్ సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పెట్రోల్ బంకుకు వెళ్లి కారులో పెట్రోల్ కొట్టిస్తుండగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది డ్రైవర్ ను దిగమని చెప్పి వెంటనే కారును రోడ్డుపైకి తోసేశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్