తప్పుడు కేసులో తనతో పాటు తన తల్లిదండ్రులను జైలుపాలు చేసి వేధించిన ఉదంతంలో ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలక వ్యక్తులు అని కాదంబరి జత్వానీ ఇటీవల దర్యాప్తు అధికారి స్రవంతి రాయ్ దృష్టికి తెచ్చారు. తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు చేశారని, అతనిపై కూడా కేసు పెట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విద్యాసాగర్పై విజయవాడలో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.