కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

68చూసినవారు
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌పై గురువారం కేసు నమోదైంది. ఆయనపై కేపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్. మనోహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1,000 కోట్లు పెట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని యత్నిస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 24న కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన వ్యాఖ్యానించిన వీడియోతో ఫిర్యాదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్