దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం పూర్తైంది. ఈ సమయంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ, బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఎన్నికల నిబంధనల ప్రకారం మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం నేరమని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనపై బెంగళూరులోని జయనగర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 123 (3) కింద కేసు నమోదైనట్లు పేర్కొంది.