ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్పై ‘‘ల్యాండ్ ఫర్ జాబ్’’ స్కామ్లో సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. లాలూతో సహా చార్జిషీట్లో మరో 77 మంది ఉన్నారు. కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇంకా అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని సీబీఐ కోర్టు తెలిపింది. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ఈ అంశాన్ని జూలై 6న పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. గతంలో మే 29న కోర్టు పూర్తి ఛార్జిషీట్ను దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది.