ఆన్లైన్లో వస్తున్న పేపర్ లీక్ వదంతులను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొట్టిపారేసింది. బోర్డు పరీక్షల పేపర్లు లీకయ్యాయంటూ ఆన్లైన్ వేదికగా వదంతులు వ్యాప్తి చెందుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సీబీఎస్సీ సోమవారం పేర్కొంది. అయితే అవన్నీ నిరాధారమైనవేనని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించే ఉద్దేశంతో కొందరు వాటిని వ్యాప్తి చేస్తున్నట్లు సీబీఎస్సీ స్పష్టం చేసింది.