దేశవ్యాప్తంగా CBSE 10, 12వ తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు CBSE ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది CBSE పరీక్షలకు దాదాపు 38 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.