తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు ప్రజాభవన్లో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ అభిమానులు హైదరాబాద్లో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద చంద్రబాబు ఫ్లెక్సీని ట్రాఫిక్ పోలీసులే కడుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వారు ఖండించారు. ఫ్లెక్సీ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పక్కకు పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు.