గత నెలలో ముంబైలో ప్రతిమేశ్ భోక్సే (19) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షవర్మా తిన్నాడు. తిని ఇంటికి వెళ్లగానే అస్వస్థతకు గురై కడుపునొప్పితో వాంతులు చేసుకున్నాడు. మరుసటి రోజు వాంతులు ఆగకపోవడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. పాడైపోయిన చికెన్తో చేసిన షవర్మా తిన్న కారణంగానే ఆ యువకుడు చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.