శిశువిహార్‌కు చిన్నారులు.. పెంచిన బంధం తెంచుకోలేక మహిళల రోదన

55చూసినవారు
శిశువిహార్‌కు చిన్నారులు.. పెంచిన బంధం తెంచుకోలేక మహిళల రోదన
హైదరాబాద్ మేడిపల్లిలో పిల్లల్ని అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, 16 మంది చిన్నారులను అమ్మినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారులను శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇన్నాళ్లూ వారిని పెంచిన మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారులు సైతం మహిళలను గట్టిగా హత్తుకొని మారాం చేశారు. సంతానం లేదన్న బాధలో తెలిసో, తెలియకో పిల్లల్ని కొనుగోలు చేశామని.. ఏళ్ల తరబడి పెంచుకున్నాక దూరం చేస్తే ఎలా బతికేదంటూ కొందరు రోడ్డుపైనే కూలబడి గుండెలవిసేలా రోదించారు.

సంబంధిత పోస్ట్