ఫిలిప్పీన్స్ పడవపై జల ఫిరంగులను ప్రయోగించిన చైనా

63చూసినవారు
ఫిలిప్పీన్స్ పడవపై జల ఫిరంగులను ప్రయోగించిన చైనా
వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. ఫిలిప్ఫీన్స్‌కు చెందిన ఓ సరకు రవాణా పడవపై చైనా కోస్ట్‌గార్డు నౌకలు జల ఫిరంగులను ప్రయోగించాయి. దీంతో ఆ చెక్క పడవ (ఉనైజా మే4) పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు ప్రకటించారు. పడవకు రక్షణ కల్పిస్తున్న ఫిలిప్పీన్స్ కోస్ట్‌గార్డు నౌకను సైతం అడ్డుకుని చైనా కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఫిలిప్పీన్స్ మండిపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్