ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సమాజంలో వివక్షకు గురవుతున్న వారికి ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయనుంది. ఉపాధి హామీ పథకం కింద పని కావాలని ముందుకు వచ్చిన ట్రాన్స్జెండర్లకు జాబ్ కార్డులు మంజూరు చేయనున్నారు. ఒక పంచాయతీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉంటే వారిని శ్రమ శక్తి సంఘాలుగా గుర్తించనున్నారు.