సినీనటుడు వేణు ఫిర్యాదుతో బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్పై హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. పీసీఎల్ జాయింట్ వెంచర్ కంపెనీలో ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు సీఎం రమేష్ కొట్టేశారని ఆరోపిస్తూ వేణు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు బదిలీ చేశారు. కాగా, వేణు తరఫున కావూరి భాస్కర్రావు స్టేట్మెంట్ ఇచ్చారు.