నీట్-యూజీ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా వాయిదా వేసిన నీట్ పీజీ పరీక్షను ఎప్పుడు నిర్వహించేదీ జాతీయ పరీక్షల మండలి రెండ్రోజుల్లో ప్రకటిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం పంచ్కులలో మీడియా సమావేశంలో తెలిపారు. నీట్పై పార్లమెంటులో చర్చ నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.