కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నరేంద్ర
మోదీ, అమిత్ షా కర్ణాటక రైతులను ద్వేషిస్తున్నారని ఆరోపించారు. కరువుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటి వరకు రైతులకు రూ.650 కోట్లు పంపిణీ చేశామన్నారు. నిర్మలా సీతారామన్,
మోదీ కారణంగా కర్ణాటకకు ఊరట లభించలేదన్నారు.