పాతబస్తీ మెట్రోకు 8న సీఎం రేవంత్ శంకుస్థాపన

56చూసినవారు
పాతబస్తీ మెట్రోకు 8న సీఎం రేవంత్ శంకుస్థాపన
హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు. దీనికి రూ.2 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. పనులను వేగంగా పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్