బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: CM రేవంత్

30342చూసినవారు
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం: CM రేవంత్
తెలంగాణలోని పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటుపై సీఎం రేవంత్‌ అధికారులను ఆరా తీశారు. ఆదిలాబాద్, మెదక్‌, సంగారెడ్డి తదితర జిల్లాల్లో గాలివాన, పిడుగు పడడంతో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మెదక్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పిడుగుపడి గాయపడిన ఐదుగురికి వైద్యం అందించాలన్నారు. ధాన్యం తడిచిన రైతులు ఆందోళన చెందవద్దని.. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్