చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి

71చూసినవారు
చుక్కా రామయ్య ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆరోగ్యం క్షీణించిందనే సమాచారం మేరకు పరామర్శించేందుకు వెళ్లడానికి సీఎం నిర్ణయించుకున్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం వివాదం కావడంతో ప్రస్తుతం సచివాలయంలో అఖిలపక్షం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దాదాపు 45 మంది ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాత రామయ్య ఇంటికి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్