మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

1108చూసినవారు
మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఆదివారం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ వెళ్లనున్నారు. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ స్థానాలపై చర్చించి అభ్యర్థుల ఫైర్లను సీఈసీ ఫైనల్ చేయనుంది. కాగా తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్