ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ జూలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోరఖ్పూర్లోని షాహీద్ అష్పక్ ఉల్లాహ్ ఖాన్ జూలాజిల్ పార్క్లో కొంతసేపు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల వయసున్న సింహం భారత్, ఏడేళ్ల వయసున్న ఆడ సింహం గౌరి ఆరోగ్య పరిస్థితిని జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖడ్గమృగాలకు ఆహారం తినిపించారు.