ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ముంబైలోని జుహు బీచ్లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. సీఎం ధామి సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో బీచ్లో చిన్నారులను కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. బీచ్లో యోగా చేస్తున్న వారితో కూడా ఆయన సంభాషించారు. స్థానిక ప్రజలతో కలిసి ఆయన ఫొటోలు దిగారు. ఇక పిల్లలతో క్రికెట్ ఆడిన సమయంలో చక్కటి షాట్లతో సీఎం ధామి అలరించారు.