కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ రాలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగినా సీఎం స్పందించరని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా సీఎం ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని, సీఎం ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.