తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతోంది. తొలి ఓవర్ వేసిన బుమ్రా మెయిడెన్ చేశాడు. 2వ ఓవర్లో ముకేశ్ కుమార్ 2 ఫోర్లు సహా 10 పరుగులిచ్చాడు. 3వ ఓవర్లో బుమ్రా ఫోర్ సహా 6 పరుగులిచ్చాడు. 4వ ఓవర్ లో ముకేశ్ బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు 3 ఫోర్లు సాధించారు. 5వ ఓవర్లో కుల్దీప్ 3 పరుగులిచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు 5 ఓవర్లలో 31/0. క్రీజులో జాక్ క్రాలీ 15, బెన్ డకెట్ 17 ఉన్నారు.