గుండెపోటుతో కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఇవాళ నిజామాబాద్లో జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతినగర్లోని నివాసం నుంచి బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగనుంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ వెళ్లనున్నారు. డీఎస్ పార్థివదేహానికి నివాళి అర్పించి, అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.