అవసరమైతేనే బయటకు రండి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు చిరంజీవి సూచన

63చూసినవారు
అవసరమైతేనే బయటకు రండి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు చిరంజీవి సూచన
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఏపీ, తెలంగాణలో వరదల ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చిరంజీవి సూచించారు. మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేసుకుంటున్నా అంటూ చెప్పారు. విపత్తుల సమయంలో బాధితులకు మా అభిమానులు అండగా ఉంటారని, ఇప్పుడు కూడా అలానే చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్