బార్బడోస్లో చిక్కుకున్న భారత
క్రికెట్ జట్టు స్వదేశానికి బయల్దేరింది. 'ఎయిర్
ఇండియా బోయింగ్ 777' స్పెషల్ ఫ్లైట్లో సూర్యకుమార్ యాదవ్తో
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫొటోను కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్స్టాలో షేర్ చేశారు. ఇంటికి వచ్చేస్తున్నామంటూ ఈ ఫొటోను పంచుకున్నారు. దీంతో విశ్వవిజేతలకు ఘన స్వాగతం పలికేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.