వారణాసిలో ప్రధాని మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా తిరస్కరణకు గురయ్యారు. అఫిడవిట్ సమర్పించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ వచ్చిన శ్యామ్ చివరి రోజైన నిన్న నామినేషన్ వేశారు. ఈ మిమిక్రీ కళాకారుడు మోదీ, రాహుల్లను అనుకరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళపాటు మోదీ విధానాలను విమర్శిస్తూ వీడియోలు చేసిన సంగతి తెలిసిందే.