బెంగళూరులోని అవలహళ్లి బీడీఏ లే ఔట్లో అద్దెకు ఉంటున్న ఓ మహిళ తన పొరుగింటి వారిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. వారు బెడ్రూమ్ కిటికీని తెరిచి ఉంచుతున్నారని, దాంతో వారి వ్యక్తిగత సంభాషణలు, సన్నిహిత శబ్దాలు తమ ఇంట్లోకి వినిపిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే వారు కిటికీని తెరిచి ఉంచుతున్నారని, వారి చేష్టలతో తమ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోందని తన ఫిర్యాదులో ఆరోపించింది.