టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు వృద్ధుడైపోతున్నారని, ఆయనకు ఓటు వేయొద్దని విజయసాయి అన్నారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు.. కొడుకును పైకి తీసుకురావడం, రిటైర్మెంట్ కు డబ్బు సంపాదించడం ఆయన ఎజెండా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రుల కలల్ని ఆయన ఎలా నెరవేరుస్తాడు? ఏపీకి స్థిరమైన యువ నేత కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.