ప్ర‌ధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు

64చూసినవారు
ప్ర‌ధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు
ప్ర‌ధాని నరేంద్ర మోదీపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టో.. ముస్లిం లీగ్ త‌ర‌హాలో ఉన్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌ధాని ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఓ అబద్ధాల పుట్ట అని, భార‌త్‌ను ముక్క‌లుగా చేసేందుకు కుట్ర జ‌రుగుతోంద‌ని మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్