పార్లమెంట్ బయట ఎంపీల ఆందోళన

55చూసినవారు
పార్లమెంట్ బయట ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవినీతి చేసిన వారు బీజేపీలో చేరితే.. వారికి అవినీతి చేసుకునేందుకు లైసెన్స్ ఇస్తుందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేత బట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు ఆప్, తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్