నిరుద్యోగులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ మోతీలాల్ నాయక్ ఏడు రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతిలాల్ నాయక్ తో మాట్లాడి, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీసి, అసెంబ్లీని స్తంభింప చేస్తామన్నారు.