ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జి జైరాం రమేష్ మాట్లాడుతూ.. పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై చర్చించామని చెప్పారు. ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాహుల్గాంధీ ఇప్పటికే 5 న్యాయాల కింద 25 గ్యారంటీలను ప్రకటించారని చెప్పారు. కాంగ్రెస్ ‘న్యాయ్ పత్ర’తో దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.