రాజ్యసభ సభ్యుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ మంగళవారం పార్లమెంటు హౌస్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసేందుకు సంజయ్ సింగ్కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. దీంతో తీహార్ జైలు నుంచి అధికారులు ఆయనను నేరుగా పార్లమెంటుకు తీసుకెళ్లారు.