కుల‌బ‌హిష్క‌ర‌ణతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వివాదం

76చూసినవారు
కుల‌బ‌హిష్క‌ర‌ణతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వివాదం
ఓ కుటుంబాన్ని కుల‌బ‌హిష్క‌ర‌ణ చేయడంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ ఘటన జ‌గిత్యాల జిల్లా సారంగ‌పూర్ మండ‌లంలోని గ‌ణేశ్‌ప‌ల్లిలో జరిగింది. ఇరువర్గాలు క‌త్తులు, రాళ్ల‌తో ప‌రస్ప‌రం దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ఆరుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిని స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం మేరకు పోలీసులు గ‌ణేశ్‌ప‌ల్లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్