మంగళవారం జరిగిన లోక్సభ ఎన్నికల కౌంటింగ్లో 293 సీట్లు సాధించి మోదీ నేతృత్వంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ సందర్భంగా మాల్దీవులు ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.