కాంగ్రెస్, BRS, మజ్లిస్ ఒక్కటేనని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్, BRS పని చేస్తాయన్నారు. కాంగ్రెస్, BRS, మజ్లిస్ మూడు వారసత్వ పార్టీలేనన్నారు. ఈ మూడు పార్టీలు కేవలం ఓటు బ్యాంకు
రాజకీయాలు చేస్తాయని.. తమ వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయని విమర్శించారు. ఓబీసీల గురించి కాంగ్రెస్, BRS ఎప్పుడైనా ఆలోచించాయా? అని ప్రశ్నించారు.