టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, వొడాఫోన్, ఎయిర్టెల్లు ఈ నెల 3 నుంచి రీచార్జ్ ప్లాన్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్దీప్ సూర్జేవాలా పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సెల్ఫోన్ సేవల చార్జీల పెంపు కారణంగా ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రీచార్జి ధరల పెంపుతో వీరందరిపై ఏటా రూ. 35000 కోట్ల భారం పడుతుందన్నారు.