పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు

50చూసినవారు
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని.. ముందు మీ ఇండ్లు కూల్చుకొని తర్వాత పేద ప్రజల దగ్గరికి రావాలన్నారు. మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధితుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహిస్తున్నదని అన్నారు.

సంబంధిత పోస్ట్