లోక్సభ ప్రొటెం స్పీకర్గా కాంగ్రెస్ నేత కె.సురేష్ పేరును ఖరారు చేసినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 26న లోక్సభకు నూతన స్పీకర్ను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. అయితే, అప్పటి వరకు కె.సురేష్ కొనసాగుతారు. కాగా, కేరళలోని మవెలికర నుంచి ఎంపీగా గెలిచిన కె.సురేష్ చాలాకాలం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు.