ఉత్తరప్రదేశ్లో తమను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ పేరిట కాంగ్రెస్ యాత్రను చేపట్టనుంది. ఇది జూన్ 11న ప్రారంభమై 15న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నేతల నుంచి కార్యకర్తలు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు.