తెలంగాణ
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు
కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ బెంజ్ కారును అందుకున్నారంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన ఆరోపణలపై
కాంగ్రెస్ పార్టీ ఆయనకు లీగల్ నోటీసులు పంపించింది. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని దీపాదాస్ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.