చివరి దశ ఎన్నికలు శనివారం (జూన్ 10)తో ముగియనున్నాయి. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవాలని EC సూచించింది. ఈ నేపథ్యంలో టీవీ ఛానెళ్లలో ఎగ్జిట్ పోల్స్పై నిర్వహించే టీవీ డిబేట్లకు కాంగ్రెస్ దూరంగా ఉండనుంది. దీనిపై ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా శుక్రవారం ప్రకటన చేశారు. ఛానెళ్ల TRP కోసం నిర్వహించే చర్చలకు తాము దూరమని, ఫలితాలు వెలువడే జూన్ 4న చర్చలకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.