ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కూడా రావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. హర్యానాలోని కర్నాల్లో, హిసార్లో సోమవారం జరిగిన ర్యాలీలలో ఆయన ప్రసంగించారు. జూన్ 4 తర్వాత రాహుల్ గాంధీ ‘
కాంగ్రెస్ ధుండో యాత్ర’ చేపట్టాల్సి ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగు దశల పోలింగ్ తర్వాత మోడీ నాయకత్వంలో
బీజేపీ ఇప్పటికే 270 సీట్లకు పైగా మెజారిటీ సాధించిందని అన్నారు.