కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అక్కడే ఉండాలని మాజీ సీఎం కేసీఆర్ సూచనల మేరకే పనులు చేసినట్లు కమిషన్కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్ట్ సమర్పించింది. దీంతో బ్యారేజీల సబ్ కాంట్రాక్టర్లను కమిషన్ గుర్తించే పనిలో పడింది.