సాధారణంగా ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ‘ఎస్ మేడమ్’ అనో లేదా ‘ఎస్ సార్’ అనో అంటుంటారు. అయితే ఈ వీడియోలో చూపిస్తున్న పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయులు హాజరువేసేటప్పుడు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని అంటూ బదులిచ్చారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు చిన్నారులకు ఇలా మతం మత్తు నింపుతున్నారని ఆగ్రహిస్తున్నారు.