పత్తి పంటలో ఎరువు వేసేముందు చేనులో కలుపు తీయాలి. మూడు, నాలుగు ఆకుల దశలో కలుపు ఉంటే ఎకరానికి 400 మిల్లీ లీటర్ల క్విజలోపాప్ ఈథైల్ (టర్గాసూపర్)+250 లీపైరిథియోబాగ్ సోడియం కలిపి పిచికారీ చేయాలి. పత్తి పంట రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తామెర పురుగులు ఆశిస్తే వాటి నియంత్రణకు కాండం పూత పద్ధతిలో ఒకసారి మోనోక్రోటోఫాస్ను నీటిలో కలిపి మొక్క కాండంపై, మధ్య భాగంలో రెండు అంగుళాల పొడవునా ఒకవైపు మాత్రమే పూయాలి.