చంద్రబాబుపై వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్రావు ఫైర్ అయ్యారు. "అంబేద్కర్ ఆలోచనలకు బాబు భిన్నం.. పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి బాబు. ఎస్సీలు, బీసీలను అవమానించి.. టిప్పర్ డ్రైవర్లకు వైసీపీ సీట్లు ఇస్తోందా? అంటూ ఎగతాళి చేసిన బాబును క్షమించే ప్రసక్తే లేదు. రెండెకరాలతో రాజకీయం మొదలుపెట్టి రూ.లక్షల కోట్ల అధిపతిగా బాబు ఎలా ఎదిగాడో అందరికీ తెలుసు." అని జూపూడి దుయ్యబట్టారు.